ఇప్పుడిప్పుడే కరోనా నుండి ప్రపంచం అంతా కోలుకుంటోంది. అక్కడక్కడా కొన్ని కేసులు ఉన్నప్పటికీ పరిస్థితి కుదుటపడింది. ఈ కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అందులో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఒక్కొక్క సినిమా థియేటర్ లో విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యనే వచ్చిన లవ్ స్టొరీ, రిపబ్లిక్, కొండపొలం మూవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఈ నమ్మకంతోనే ఈ రోజు మరొక మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది. ఆర్ ఎక్స్ 100 లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది మనము చూశాము.

అందుకే అజయ్ భూపతి తర్వాతా సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత వస్తున్న చిత్రం "మహా సముద్రం". ఇది కూడా ఒక కొత్త లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్ మరియు శర్వానంద్ లు హీరోలుగా నటించగా, అదితి రావు హైదరి మరియు అనూ ఇమ్మనుయెల్  హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.  సినిమా విజయంపై చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత సిద్దార్థ్ ఈ చిత్రంలో తెలుగు సినిమాలో నటిస్తుండడంతో  అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రావు రమేష్, కేజీఎఫ్ విలన్ గరుడ పాత్రలు అద్భుతంగా ఉంటాయంటున్నారు.

అయితే చిత్ర యూనిట్ పెట్టుకున్న నమ్మకాలు నిజమవుతాయా? మహా సముద్రం సునామీ సృష్టిస్తుందా అనేది తెలియాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే. ప్రస్తుతం వరకు విడుదల అయిన మూడు సినిమాలు మంచి టాక్ తోనే థియేటర్ లో నడుస్తున్నాయి. ప్రేక్షకులు కూడా చాలా కాలం వరకు థియేటర్ కు వెళ్ళక ఒక్కసారిగా సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఎంతో ఉత్సాహంగా వెళుతున్నారు. అయితే అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా బ్లాక్ బస్టర్  అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: