టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ పేరు ను ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, వెన్నెల, గమ్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా ఎదిగాడు. ఆ తరువాత ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి వరుస బ్లాక్ బాస్టర్ సినిమాల తో తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా ఎదిగాడు. ఇలా వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న  శర్వానంద్ ఆ తర్వాత నటించిన రణరంగం, జాను, పడి పడి లేచే మనసు , శ్రీకారం వంటి వరస పరాజయాలతో డీలా పడిపో యాడు.

ఇలా ఎన్నో ఆశ లు పెట్టుకున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఇప్పటికే మహా సముద్రం సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఇలా జనాలలో మంచి హైట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ రోజు అనగా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరీ, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి శర్వానంద్ కు మహా సముద్రం సినిమా అదిరిపోయే కాం బ్యాక్ ను తీసుకు వస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: