బాలయ్యకి తెర మీద ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందొ తెర వెనుక కూడా ఆయన స్పీచ్ లకి , ఎదైనా మొహమాటం లేకుండా చెప్పే గుణానికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా ఇంటర్వూస్ లో కూడ చేసే అల్లరి అంత ఇంత కాదు. దీనినే కాష్ చేసుకుందాం అని ఆహా ఓటిటి బాలయ్య మీద ఒక టాక్ షో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా అంత దీని గురించే మాట్లాడుకున్నారు. అయితే ఎక్కువ లేట్ చేయకుండా ఆహా కూడా ఈ షో పెరు ఆన్ స్టాపబుల్ అని పెట్టి ఈరోజు ఘనంగా లాంచ్ చేశారు. ఈ ఫంక్షన్ లో బాలయ్య చాలా హుషారు గా కనిపించారు. తనని ఇలా టాక్ షో కి పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ కి ఆయన శుభాకాంక్షలు చెప్పారు.ఇక ఆహా అధినేత ప్రముఖ నిర్మత అల్లు అరవింద్ ఈ ఫంక్షన్ లో బాలయ్య గురించి చాల బాగా చెప్పారు. బాలయ్య తెర మీద గొప్పగా నటిస్తాడు , బయట గొప్పగా జీవిస్తాడు , నవ్వు వస్తే నవ్వు ,కోపం వస్తే కోపం ఏ ఎమోషన్ ని అయిన నటించకుండా చూపించడం బాలయ్య గొప్పతనం అని అల్లు అరవింద్వేదిక మీద చెప్పారు.

ఇన్ని రోజులు వెండితెర మీద చెప్పే డైలాగ్స్ తోనే మనల్ని అలరించిన బాలయ్య ఈ టాక్ షో బుల్లితెర మీద ఎంత ప్రభంజనం సృష్టిస్తాడో వేచి చూడాలి. నవంబర్ 4 న దీపావళి కి ఆహా లో ఈ షో మొదలుకాబోతుంది. ఇక షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే మాత్రం నందమూరి , మెగా అభిమానులకి పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: