పాన్ ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయిన రాజమౌళి నెక్ట్స్ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది.సూపర్స్టార్ మహేశ్తో కలిసి పనిచేస్తానని గతంలోనే రాజమౌళి ప్రకటించారని అందరికి తెలుసు.

తాజాగా ఈ విషయంపై సూపర్ స్టార్ మహేశ్ కూడా ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తుంది.. తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని మహేశ్ చెప్పినట్లు సమాచారం.హిందీలో మూవీ చేయడానికి ఇదే సరైన సమయమని సూపర్ స్టార్ మహేష్ చెప్పడం జరిగింది. తన తర్వాత సినిమా రాజమౌళితో చేయడం జరుగుతుందని ఇది అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారని సమాచారం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ ప్రస్టేజియస్ ఫిల్మ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ మరియు రాజమౌళి మూవీ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నారని అందరికి తెలుసు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోందని సమాచారం.

కాగా రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషనులో సినిమా రాబోతుందని వార్తలు వచ్చినప్పటి నుంచి పలానా కథతో మరియు పలానా చోట తీస్తారు అంటూ పలు ఊహాగానాలు కూడా వచ్చాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా అడ్వెంచర్ కథతో తెరకెక్కనుందని అలాగే ఆఫ్రికా అడవుల్లో తీస్తారని ప్రచారమూ గతంలో జరిగిందని తెలుస్తుంది.కానీ జక్కన్న మన దగ్గర కాకుండా విదేశీ నేపథ్య కథతో ఇప్పటివరకు సినిమా తీయలేదని మరి మహేశ్ చిత్రంతో ఆ ప్రయోగం చేస్తారేమో అని అందరు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారని సమాచారం. అయితే ఈ కాంబినేషను పై ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తోన్న సినీ అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుందని తెలుస్తుంది.‘ఆర్ఆర్ఆర్’ అనౌన్స్ చేసిన తర్వాత థియేటర్లలోకి రావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టనుందని అందరికి ఈపాటికి అర్థమై ఉంటుంది..దీంతో మహేశ్ సినిమా ఇంకెన్నాళ్లు పడుతుందో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: