ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే పూజాహెగ్డే అనే చెప్పాలి ఒక లైలా కోసం సినిమా తో తెలుగు సినిమా జర్నీ మొదలు పెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత ముకుంద సినిమా చేసి వరుసగా రెండు ఫ్లాప్ లను ఖాతాలో వేసుకుంది అమ్మడు. దాంతో ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడటంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ అవమాన భారంతో ఆమె బాలీవుడ్ లో కసిగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలోనే అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ గా నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మరో రెండు మూడు బాలీవుడ్ సినిమాల్లో చేసిన తర్వాత ఆమెకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో అవన్నీ పక్కన పెట్టి దర్శకనిర్మాతలు ఆమెను తెలుగులో హీరోయిన్ గా చేయించాలి అని ఆమెను తెలుగులో మళ్లీ తీసుకువచ్చారు. ఆ విధంగా తన రీ ఎంట్రీ లో వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది పూజా హెగ్డే.  ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే సరికి ఆమెకు ఎదురులేకుండా పోయింది.

అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కాజల్, సమంత వంటి హీరోయిన్ లు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉండడంతో పూజా హెగ్డే కు అది కలసి వచ్చి స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి ఆమె అఖిల్ లాంటి చిన్న హీరో తో నటించడం ఏంట్రా అని విమర్శలు వచ్చాయి.  కానీ ఆమె హీరోని చూసి కాదు ఆమె పాత్ర తీరు తెన్నులను చూసి ఈ చిత్రం ఒప్పుకుంది సినిమా చూసిన ప్రతి వారు చెబుతున్నారు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ, అలాగే దర్శకుడు మరియు హీరో లను చూసి మాత్రమే కాదు ఈ సినిమా కథ లో తన పాత్ర చాలా వెరైటీగా ఉంది, గతంలో తాను ఎప్పుడూ చేయని విధంగా ఈ పాత్ర వుండడం తో ఆమె చేశారని గతంలో కూడా చెప్పింది.  ఇప్పటికైనా ఈ విమర్శలు ఆగుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: