అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ బుల్ బ్యాచిల‌ర్ సినిమా రెండున్న  రేళ్లుగా ఊరించి ఊరించి ఎట్ట కేల‌కు ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అప్పుడెప్పుడో మ‌న చిన్న‌ప్పుడు 2007లో బొమ్మ‌రిల్లు అనే సినిమా తో యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో ఎప్ప‌ట‌కీ నిలిచి పోయే ఓ మంచి సినిమాను అందించిన భాస్క‌ర్ అనే ద‌ర్శ‌కుడు త‌ర్వాత ఏమై పోయాడో తెలియ లేదు. ఆ సినిమాతో భాస్క‌ర్ కాస్తా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అయిపోయాడు. త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్ సినిమా డిజాస్ట‌ర్ అయినా కూడా అత‌డి టేకింగ్‌, కొన్ని సీన్లు మంచి మార్కులు ప‌డేలా చేశాయి. త‌ర్వాత రామ్ తో ఒంగోలు గిత్త లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు.

ఇక భాస్క‌ర్ ను ప్రేక్ష‌కులు ఎప్పుడో మ‌ర్చిపోయారు. అయితే ఎలాగోలా గీతా కాంపౌండ్ లో చేరాడు. వాళ్ల‌ను ఈ క‌థ చెప్పి ఎలా ప‌డేశాడో కాని.. మొత్తానికి అఖిల్ తో ఓ ఛాన్స్ ప‌ట్టేశాడు. ఇప్ప‌టికే అఖిల్ కు మూడు వ‌రుస ప్లాపులు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాతో అయినా మ‌నోడు హిట్ కొడ‌తాడ‌ని నాగార్జున ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా చూసిన వారు అఖిల్ ఆశ‌లు ఈ సినిమాతో కూడా నెర‌వేరేలా లేవ‌ని డిసైడ్ అయిపోయారు.

విచిత్రం ఏంటంటే అఖిల్ ఇంట్రడక్షన్ సీన్ గొర్రెల మందల మధ్య లో నుంచి రివీల్ చేశారు. అయితే కాసేప‌ట‌కి ప్రేక్ష‌కుడి కి కాస్త తెలివి వ‌స్తుంది. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌ను గొర్రెల‌ను చేసేందుకే ఈ షాట్ ను సింబాలిక్ గా వాడార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక ఇప్ప‌టికే పూజా హెగ్డే కేవ‌లం తొడ‌ల అందాలు చూపిస్తూ కుర్ర కారు ను ప‌డేస్తుందే త‌ప్పా ఆమెకు న‌ట‌న రాద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ సినిమాతో కూడా ఆమె మ‌రోసారి అదే ఫ్రూవ్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: