త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నాళ్ల క్రితం వరకు ఏ హీరోతో సినిమా తీసినా హీరోయిన్‌గా సమంతనే తీసుకునేవాడు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌తో సినిమాలు తీసినా, నితిన్ లాంటి యంగ్ స్టర్‌తో సినిమా అయినా సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. అయితే సమంతకి పెళ్లాయ్యాక ఈ రిపీట్‌ కాంబినేషన్‌కి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నాడు. 'అరవింద సమేత'తో వీళ్లద్దరి సినీ ప్రయాణం రిపీట్ అయింది. ఆ తర్వాత 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్‌ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మహేశ్‌ సినిమాకి కూడా పూజా హెగ్డేని హీరోయిన్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్.

శేఖర్ కమ్ముల యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీస్ తీసినా, కాలేజ్‌ డ్రామాలు డైరెక్ట్ చేసినా, హీరోయిన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల్లో నటించాలని చాలామంది హీరోయిన్లు ఆశ పడుతుంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం కొంతమంది హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తున్నాడు. వాళ్లనే రిపీట్ చేస్తుంటాడు. శేఖర్ కమ్ముల మొదట్లో కమలినీ ముఖర్జీతో రెండు సినిమాలు తీశాడు. 'ఆనంద్, గోదావరి' సినిమాలో కమలినీని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ మూవీస్‌తో కమలీనికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 'హ్యాపీడేస్' సినిమాలో కూడా కమలినీ ముఖర్జీతో స్పెషల్‌ రోల్ చేయించాడు.

శేఖర్ కమ్ముల ఈమధ్యకాలంలో సాయి పల్లవిని ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు. 'ఫిదా' సినిమాతో ఫస్ట్‌ టైమ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించింది పల్లవి. ఇక ఈ మూవీలో హైబ్రిడ్‌ పిల్ల పెర్ఫామెన్స్‌కి ఇంప్రెస్ అయిన కమ్ముల 'లవ్‌స్టోరి'కి హీరోయిన్‌గా తీసుకున్నాడు. నెక్ట్స్ ధనుష్‌తో చేయబోతున్న మల్టీలింగ్వల్‌ మూవీకి సాయి పల్లవినే హీరోయిన్‌గా ఫైనల్‌ చేశాడట శేఖర్ కమ్ముల.


సినిమాకి కంటెంట్, కటౌట్‌తో పాటు కెమిస్ట్రీ, కంఫర్ట్ లెవల్స్‌ కూడా చాలాముఖ్యం. మేకర్స్‌కి, ఆర్టిస్ట్‌కి బాగా సింక్ అయితే అవుట్‌పుట్‌ కూడా అదే లెవల్లో ఉంటుంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మేకర్స్‌ ఎక్కువగా కంఫర్ట్‌ లెవల్స్‌కే ప్రియారిటీ ఇస్తుంటారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: