బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో సంవత్సరాలు గడుస్తున్నా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇతర ఛానెళ్లలో కూడా కామెడీ షోలు ప్రసారమవుతున్నా ఆ షోలు జబర్దస్త్ కు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో విఫలవుతున్నాయని తెలుస్తుంది.

తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ షో ప్రోమో విడుదలైందని తెలుస్తుంది.

ఈ ప్రోమోలో రోజా స్టార్ హీరో బాలకృష్ణకు ఫోన్ చేయగా బాలకృష్ణ రోజాతో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయని సమాచారం. అనసూయ రోజాతో ఈరోజు బాలయ్య బాబుగారికి కాల్ చేయాలని చెప్పగా రోజా బాలయ్య బాబు మంచి మూడ్ లో ఉంటే ఓకే లేదంటే అంటూ కామెంట్లు చేసారని తెలుస్తుంది.. ఆ తర్వాత రోజా బాలకృష్ణకు కాల్ చేయగా బాలకృష్ణ రోజాగారు నమస్కారం అని చెబుతాడట.. రోజా బాగున్నారా అని అడగగా బాగున్నానని బాలయ్య సమాధానం ఇస్తాడని తెలుస్తుంది.

మీరెలా ఉన్నారని బాలకృష్ణ అడగగా బాగున్నాను సార్ అని రోజా సమాధానం ఇస్తారని తెలుస్తుంది.. నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారట.. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని భైరవద్వీపం పార్ట్ 2 చేస్తారా లేక బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా అని అడుగుతున్నారని రోజా చెప్పుకొచ్చారట.. రోజా అలా చెప్పగానే బాలకృష్ణ పకపకా నవ్వి మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెబుతారని తెలుస్తుంది.. జబర్దస్త్ కు జడ్జిగా కూడా తాను వస్తానని బాలయ్య పేర్కొన్నారని సమాచారం. రాఘవ మరియు ఆది అందరూ నాకంటే పెద్దవాళ్లని బాలయ్య సరదాగా కామెంట్లు చేశారట. భవిష్యత్తులో బాలయ్య జబర్దస్త్ కు జడ్జిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. అయితే బాలకృష్ణ బుల్లితెర షోలపై దృష్టి పెట్టడంతో నందమూరి అభిమానులు షాకవుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: