టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినా నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది..

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఒకప్పుడు సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని తెలుస్తుంది.వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయని సమాచారం..

 

ఇలా కొన్ని రోజులపాటు వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వార్తల గురించి వీరు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.. అయితే దేవి శ్రీ ప్రసాద్ మరియు ఛార్మి మధ్య ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో నిజంగానే ఛార్మి, దేవి శ్రీ ప్రసాద్ లకు పెళ్లి చేయాలని దేవి తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఛార్మి తల్లిదండ్రులు వెళ్లి వీరి పెళ్లి గురించి ఎన్నో సంప్రదింపులు జరిపారని సమాచారం.ఇలా పెళ్లి ద్వారా దేవి మరియు ఛార్మి ఒక్కటవుతారని భావించారని తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత వీరి పెళ్లి విషయం కేవలం సంప్రదింపుల వరకు మాత్రమే ఆగిపోయిందని తెలుస్తుంది.

ప్రస్తుతం చార్మి హైదరాబాద్ లో కాకుండా పలు సినిమాల షూటింగ్ నిమిత్తం ఎక్కువగా ముంబైలోనే సెటిల్ అయ్యారని సమాచారం.ఈ క్రమంలోనే పెళ్లి పై ఎన్నో కామెంట్లు చేస్తూ పెళ్లి చేసుకోవడం కన్నా ఒక బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అంటూ చార్మీ ఎన్నోసార్లు పెళ్లి గురించి కామెంట్లు చేశారని సమాచారం.అయితే ప్రస్తుతం ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు తీస్తూ వీరిద్దరు ముంబైలో ఒకేచోట ఉన్నారని సమాచారం.. ఈ క్రమంలోని పూరి ఛార్మి గురించి కూడా ఈ విధమైనటువంటి వార్తలు మొదట్లో చక్కర్లు కొట్టాయని తెలుస్తుంది.. ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: