కానీ ఎట్టకేలకు పూజా హెగ్డే తో కలిసి తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల అయ్యి, అందరి అంచనాలను ఒక్కసారిగా తారుమారు చేసింది.. అంతేకాదు ప్రేక్షకుల స్పందన కూడా ఈ సినిమాపై చాలా బాగా వచ్చిందని కూడా చెప్పాలి.. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించిన పూజాహెగ్డే అఖిల్ సరసన నటించడంతో సినిమాకు హైలెట్ గా నిలిచింది.. ఈ సినిమా అత్యంత విజయాన్ని అందుకుంది అనే చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది ఈ సినిమా.. ఇక అక్కినేని అభిమానులు మాత్రం ఎట్టకేలకు మంచి విజయాన్ని అఖిల్ సాధించాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ ఏ సినిమాకు దర్శకత్వం వహించినా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే.. అలాగే అక్కినేని అఖిల్ తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు అలాగే వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.
కానీ కొవిడ్ 19 కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు 2021 అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారు.
ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పాత్రల కోసం సుమారుగా 100 మందిని ఆడిషన్స్ జరుపగా, ఎట్టకేలకు 2019 ఆగస్టులో ఈషా రెబ్బ అలాగే పూజా హెగ్డే లను ఖరారు చేశారు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక ఎన్ఆర్ఐ గా నటించగా , పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ గా నటించారు.