యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మెగా కాంపౌండ్ కు చెందిన ఆహా ఓటీ టీ టాక్ షోలో కి ఎంట్రీ ఇవ్వ‌డం ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో పెద్ద ఆస‌క్తి క‌ర అంశంగా మారింది. ఎందుకంటే ఆహా అధినేత అల్లు అర‌వింద్ మెగాస్టార్ చిరంజీవికి స్వ‌యానా బావ‌మ‌రిది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ చిరంజీవి ఎదుగు ద‌ల‌లో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హిరించింది. ఆయ‌న ఎక్కువుగా చిరంజీవి తోనే సినిమాలు చేశారు. చిరంజీవి కెరీర్ ప్లానింగ్ లో అర‌వింద్ ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఇక ఇటు తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి వ‌ర్సెస్ యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఎలాంటి యుద్ధం న‌డిచేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు మూడు ద‌శాబ్దాల నుంచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాల‌య్య వ‌ర్సెస్ చిరంజీవి మ‌ధ్య వార్ మామూలుగా ఉండ‌దు. ఒక‌ప్పుడు వీరి సినిమాలు పోటీ ప‌డుతున్నాయంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు.

అలాంటిది వారిద్ద‌రిని క‌లిసి ఒక స్క్రీన్ మీద చూపించే సాహ‌సం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ చేయ‌లేదు. అయితే అల్లు అర‌వింద్ చ‌క్రం తిప్పి యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ను చిరంజీవిని ఒకే స్క్రీన్ మీద‌కు తీసుకు వ‌స్తున్నారు. వాస్త‌వంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నదే. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీలో మంచి వాతావ‌రణం ఏర్ప‌డ‌డంతో పాటు మిగిలిన హీరోల మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం ఏర్ప‌డి.. వారు కూడా భ‌విష్య‌త్తులో మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేసేందుకు దోహ ద ప‌డుతుంది.

మ‌రి త‌మ అభిమాన హీరోలు చిరు, అటు బాల‌య్య ఒకే స్క్రీన్ మీద సంద‌డి చేయ‌డంతో పాటు ఎలాంటి ర‌చ్చ షురూ చేస్తారో ? అని ఆ ఇద్ద‌రు హీరోల అభిమానులే కాకుండా కోట్లాది మంది తెలుగు సినీ , బుల్లితెర అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: