సమంత తో నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రకటించిన రోజు నుంచి ఆమె చాలా నలిగిపోయింది.. అంతేకాదు సమంతను ముద్దాయిగా చిత్రీకరిస్తూ..ఎంతో మంది ఆమెను దూషించారు కూడా.. కానీ ఆమె ఏ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతోంది.. నిజానికి సమంత సినిమాలకు దూరం అయి పిల్లలను కనాలని భావించినప్పటికీ నాగచైతన్య తో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇకపోతే వరుస ప్రాజెక్టులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. ఇప్పటికే శాకుంతలం సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తున్న సమంత , నాగ చైతన్య తో విడాకులు ప్రకటించిన తర్వాత సరికొత్తగా మరొక ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా ఇవ్వడం జరిగింది..


తెలుగు -  తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతున్న ఓ సినిమా ప్రాజెక్టుకు సమంత సైన్ కూడా చేసింది. ఈ సినిమాకు శాంతరూబన్  జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక నిర్మాతలుగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి టైటిల్ ను  ఇప్పటివరకు ఖరారు చేయలేదు.. ఈ చిత్రం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోందని దర్శకుడు తెలియజేశారు.. నాగచైతన్య తో వివాహం జరిగిన తర్వాత ఓ బేబీ, యూటర్న్, మజిలీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అబ్బుర పరిచిన ఈ ముద్దుగుమ్మ , ఇప్పుడు ఒక లవ్ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు..


ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమంత నటించిన ఫ్యామిలీ మాన్ టు వెబ్ సిరీస్ తర్వాత ఈమెకు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఎక్కువగా వచ్చినప్పటికీ, ఈమె ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని గతంలో వాటన్నింటిని దూరం చేసుకుంది.. ప్రస్తుతం విడాకులు కారణంగా సినిమాలతోనే బిజీ గా ఉండాలని, మంచి కథలకు ఓకే చెబుతూ మరింత స్టార్డంను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది సమంత.. మరో వైపు బీటౌన్లో తెరకెక్కబోతున్న మరో ప్రాజెక్టుకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు..? నిర్మాత ఎవరు..? నటీనటులు ఎవరు..? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: