తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో బాలకృష్ణ ఒక్కరు. ఆయన ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు బిజినెస్ వైపు కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టాలీవూడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలయ్య ఇప్పటికీ మరింత అభిమానాన్ని పెంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా బాలయ్య యాపారం మామూలుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

అసలు అంత రచ్చ దేనికోసం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా. అయితే బాలయ్య ఓటీటీ వేదికగా ఓ రియాలిటీ షోలో చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం గురించి తాజాగా బాలయ్య మీడియాతో పంచుకున్నారు. ఆహా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను అన్ స్టాపబుల్ అనే షో ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నారు. అంతేకాక.. ఈ విషయం గురించి మాట్లాడుతూ మనిషి ప్రజెంటేషన్ అన్ స్టాపబుల్ అంటూ నవ్వడం, నవ్వించడం నటన కాదు పాత్రలోకి ప్రవేశించడమని ఇది ఎంతో ఒత్తిడితో ఉంటుందని తెలిపారు.

ఇక ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం అనేది ఉంటుందని.. వాటిని ఎదురుకుని లక్ష్యాన్ని చేరుకోవడమే అన్ స్టాపబుల్ అని అన్నారు. అయితే తనకు నచ్చిందని అందుకే ఈ షోను ఒప్పుకున్నానని.. ఇందులో హాజరయ్యే నటీ నటులతో కలిసి మాట్లాడతానని తెలిపారు. అంతేకాక.. వాళ్లను మాటలతో ట్విస్టు చేస్తాను అంటూ.. ఆహా వేదికలో అన్ స్టాపబుల్ షోలో కలుద్దాం అంటూ ముగింపు చెప్పారు.

కాగా.. ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన మాటలు ఆయన అభిమానులనే కాకుండా నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మొత్తానికి ఈ షో వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అయితే ఇదంతా చూస్తే బాలయ్య యాపారం మామూలుగా లేదు కదా అంటూ ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: