నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి  ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. అలాగే తెలుగు కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా బాలకృష్ణ ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇలా వరుస సినిమాలు లైన్ లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న బాలకృష్ణ తెలుగు ప్రముఖ  ఓటిటి ఆహ లో ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించ బోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కు సంబంధించిన ఒక ప్రోమో ను కూడా ఆహా నిర్వాహక బృందం బయటకు వదిలారు. దీనికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

 అలా గే ఈ టాక్ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు జనం కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాక్ షో కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా లో హోస్ట్ గా వ్యవహరించే టాక్ షో కోసం 40 లక్షల వరకు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం గా 12 ఎపిసోడ్ గా ఈ టాక్ షో ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే ఈ టాక్ షో కోసం ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్త లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: