ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అలా రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కి విడుదల అవుతుండగా ఆ తర్వాత సలార్ ఆదిపురుష్ అలాగే ప్రాజెక్ట్ కే ఇంకా స్పిరిట్ చిత్రాలు రానున్నాయి. ఇవే కాకుండా మరో రెండు సినిమాలను కూడా చేసే ఆలోచన చేస్తున్నాడు ప్రభాస్.  అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు దేశంలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్.  

ఇక ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ లో ఆ స్థాయి లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత భారీ దర్శకులతో భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుండడం మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు రామ్ చరణ్.  శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే అన్ని భారీ స్థాయిలోనే ఉంటాయి.

ఈ నేపథ్యంలో మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న శంకర్ సినిమాపై ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి సినిమా ను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ఇన్ని రోజులు వార్తలు వినిపించగా దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. జెర్సీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను ఆకర్షించిన గౌతమ్ ఇప్పుడు అదే సినిమాను బాలీవుడ్ లో  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కు సరిపోయే కథను చెప్పగా రామ్ చరణ్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా చరణ్ సినిమా చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటన వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: