టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
సంగీత దర్శకుల కొరత చాలా ఉందని చెప్పవచ్చు. మొదటి నుంచి
టాలీవుడ్ లో ఒకరిద్దరు మినహా
సంగీత దర్శకులు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలిన సందర్భాలు లేవు. అలా ప్రస్తుతం
తమన్ మరియు
దేవిశ్రీప్రసాద్ తప్ప వేరే
సంగీత దర్శకులు ఎవరు కూడా తెలుగు
సినిమా ప్రేక్షకులను మెప్పించే రేంజ్ లో సంగీతం అందించకపోవడం గమనార్హం. తాజాగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మూడవ
సంగీత దర్శకుడి కోసం చాలామంది
సంగీత దర్శకులు ప్రేక్షకులను మెప్పించే విధంగా సంగీతం అందించడం మొదలు పెట్టారు.
అలా అనూప్ రూబెన్స్, గోపి సుందర్, మిక్కీ జే మేయర్ వంటివారు
తమన్, దేవిశ్రీ వంటి అగ్ర
సంగీత దర్శకుల తర్వాత స్థానానికి పోటీ పడుతుండగా ఇప్పుడు వీరికి పోటీగా ఓ
యువ సంగీత దర్శకుడు చేరడం ఇప్పుడు ఎంతో ఆసక్తి కరమైన పోటీ ఏర్పడింది అని చెప్పొచ్చు. ఆయన ఎవరో కాదు
మహతి స్వర సాగర్.
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా
శంకర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను
దసరా సందర్భంగా ఇవ్వగా ఈ సినిమాకు సంగీతాన్ని
మణిశర్మ తనయుడు
మహతి స్వర సాగర్ అందించబోతున్నారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ ఈ
పోస్టర్ ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటి వరకు చాలా సినిమాలకు సంగీతం అందిస్తున్న
మహతి స్వర సాగర్ ఈ సినిమాకు ముఖ్యంగా
మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి. గతంలో ఆయన
తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి ఎన్నో మరపురాని హిట్ పాటలను అందించాడు. ఆ విధంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్వర సాగర్ కు ఇంత పెద్ద
సినిమా అవకాశం రావడం అంటే గొప్ప విశేషమని చెప్పాలి. మరి తండ్రిలా ఆ రేంజ్ లో
మెగాస్టార్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తాదా అనేది చూడాలి.