మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలివుడ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు, ఈ ఫంక్షన్ లో భాగంగా చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఈ సినిమా హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలతో పాటు కొంత మంది నటీనటులను కూడా చూపించారు.

 అయితే ఈ సినిమా ను దర్శకుడు శంకర్ ఇండియా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది. ఇది లా ఉంటే తాజాగా కియారా అద్వానీ రామ్ చరణ్, శంకర్ సినిమా గురించి స్పందించింది. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే నేను రివీల్ చెయ్యలేను. కానీ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యం ఉన్న మూవీ అని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమా వివాదాస్పద అంశాల తో తెరకెక్కుతోంది అని నేను భావించడం లేదు. ఈ సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది అని కియారా అద్వానీ తెలిపింది. ఇక కియారా అద్వానీ నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: