తెలుగు వెండితెరపై హిట్ జోడిగా అనిపించుకున్న  హీరో, హీరోయిన్లు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ - విజయశాంతి ల జంట కూడా ఒకటి.1980 ల కాలంలో వీరిద్దరూ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేశారు.సుమారు 17 సినిమాల్లో నటించి పలు రికార్డులతో పాటూ నిర్మాతలకు లాభాల పంట పండించారు బాలయ్య - విజయశాంతి.ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా 'నిప్పు రవ్వ'.ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఈ కాంబినేషన్లో సినిమా రాలేదు.అయితే ఇంతటి హిట్ జోడి ఒక్కసారిగా కలిసి నటించడం మానేయడంతో సహజంగా ప్రేక్షకులతో పాటు సినీ జనాలు కూడా నానా రకాలుగా అనుకున్నారు.

ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన నిప్పు రవ్వ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య - విజయశాంతి మధ్య విభేదాలు వచ్చాయని..అందుకే వారిద్దరూ కలిసి నటించడం లేదని అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి.అలా సుమారు మూడు దశాబ్దాలుగా వార్తలు ప్రచారం అవుతూనే వచ్చాయి.ఇక దీన్ని ఇలాగే వదిలేస్తే లాభం లేదని భావించిన విజయశాంతి.. గాసిప్ రాయుళ్లు నోరు మూయించాలని డిసైడ్ అయ్యింది.దీనిలో భాగంగానే బాలయ్యతో తాను కలిసి నటించకపోవడం వెనక ఉన్న కారణాలను చెప్పారు.ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి..నిప్పురవ్వ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని,అలాగే ఇమేజ్ కూడా పెరిగిందని చెప్పారు.

దాంతో తాను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపైన ఫోకస్ చేశానని.. అందుకే బాలయ్యతో తనకు కాంబినేషన్ సెట్ అవ్వలేదని వెల్లడించారు విజయశాంతి.అంతేతప్ప తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.ఇక ప్రస్తుతం విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతుండగా.. బాలయ్య మాత్రం వరుస సినిమాలతో పాటూ అటు రాజకీయ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నారు.ఇప్పటికీ బాలకృష్ణ - విజయశాంతి ల కలయికలో సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: