ఒకప్పుడు బయోపిక్ చేయాలంటే హీరోలే చేసేవారు. అంతే కాకుండా ఏదైనా రంగంలో స‌త్తాచాటిన మ‌గ‌వాళ్ల బ‌యోపిక్ లే ఎక్కువ‌గా క‌నిపించేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్ప‌ట్లో బ‌యోపిక్ లు కూడా చాలా తక్కువగా వచ్చేవి కానీ ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్... కోలీవుడ్ల‌లో ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బయోపిక్ లో నటించేందుకు తమ యాక్టింగ్ టాలెంట్ ను బయట పెట్టేందుకు నటీనటులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఇక హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బయోపిక్ ల‌లో నటించి సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా బయోపిక్స్ లో నటిస్తున్న వారిలో కీర్తి సురేష్, కంగనా రనౌత్ లు ఉన్నారు. 

ఇక ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్ బామ‌లు కూడా బ‌యోపిక్స్ లో నటించడానికి చాలా ఇష్టం అని చెబుతున్నారు. తాప్సీ పన్ను, జాన్వీకపూర్ లు తమకు బయోపిక్ ల‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా పాత్రలో నటించి అలరించింది... అంతే కాకుండా ఇప్పుడు అరుణిమ  పాత్రలో నటించాలని ఎంతో ఆసక్తి చూపిస్తోంది. అరుణిమ సిన్హా ఫిజికల్లీ చాలెన్జ్డ్ ఉమెన్... ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. కొందరు దుండగుల దాడిలో అరుణిమ సిన్హా త‌న‌ కుడికాలును పోగొట్టుకుంది. అయినప్పటికీ 25 ఏళ్ల‌ వయసులోనే ఎవరెస్ట్ ను అదిరోహించి ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచింది.

ఇక ఆ పాత్రలో నటించాలని ఆసక్తి గా ఉందంటూ జాన్వీకపూర్ చెబుతుంది. ఇదిలా ఉంటే తాప్సీ పన్ను ఇప్పటికే భారత ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న శభాష్ మీతో అనే చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగానే మిషన్ మంగళ్... శాండీ ఆన్ టోల్డ్ స్టోరీ సినిమాల‌లో తాప్సి రియల్ లైఫ్ క్యారెక్టర్ ను పోషించింది. అంతేకాకుండా ఫ్రీడమ్ ఫైటర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మ‌రో సినిమాలో కూడా తాప్సీ నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: