యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి డ్రీం ప్రాజెక్ట్ "మహా సముద్రం" ఎట్టకేలకు దసరా కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతగా వేచి చూశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన సూపర్‌ హిట్ మూవీ ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన రెండవ యాక్షన్ డ్రామా 'మహా సముద్రం'. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్ అండ్ అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించారు. అదితి డ్యాన్స్ టీచర్ పాత్రలో, అను లాయర్ పాత్రలో కన్పించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. 'మహా సముద్రం' మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద రూ . 2.58 కోట్ల షేర్లను వసూలు చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ ఇంటెన్సివ్ లవ్ స్టోరీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా 'మహా సముద్రం' ఫస్ట్ డే కలెక్షన్లు :
నైజాం : రూ .87 లక్షలు
సీడెడ్ : రూ .45 లక్షలు
యూఏ : రూ. 31 లక్షలు
ఈస్ట్ : రూ .18 లక్షలు
వెస్ట్ : రూ .14 లక్షలు
గుంటూరు : రూ .35 లక్షలు
కృష్ణ : రూ .15 లక్షలు
నెల్లూరు : రూ .13 లక్షలు
మొత్తం టోటల్ ఎపి/టిఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 'మహా సముద్రం' రూ 2.58 కోట్లు (రూ. 4.4 కోట్లు గ్రాస్)
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 'మహా సముద్రం' కలెక్షన్స్ రూ 2.86 కోట్లు (రూ. 5 కోట్లు గ్రాస్)

మరోపక్క సిద్ధార్థ్ నెక్స్ట్ కమల్ హాసన్, కాజల్ అగర్వాల్‌తో కలిసి శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఇండియన్ 2' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: