మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, చాలా మంది ఈ సినిమాను దీపావళికి లేదా సంక్రాంతికి విడుదల చేయవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

  కాకపోతే ఆచార్య సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు, ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడంవల్ల ఆర్ఆర్ఆర్ సినిమా జనవరిలో విడుదల కాబోతున్ననందు వలన ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసినట్లయితే రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల వచ్చే క్రేజ్ ఆచార్య సినిమాకు కలిసి వస్తుందని బాలీవుడ్ లో మంచి విజయం సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఆచార్య సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమాను బాలీవుడ్ లో పెన్ స్టూడియోస్ విడుదల చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవిసినిమా తో పాటు మలయాళం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు తమిళ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా నటించడానికి రెడీగా ఉన్నాడు. మరియు మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో కూడా నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: