ఈ రోజు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఒక్క మనోజ్ తప్ప. 'మా' ఎన్నికలపై విష్ణు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన తమ్ముడికి విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ ట్రోలింగ్ కు కారణమవుతోంది. ఆమె ట్వీట్ ను షేర్ చేసుకుంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు లక్ష్మి చేసిన ట్వీట్ ఏమిటంటే...

"ఈ రోజు బిగ్ డే. మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు. ప్రపంచాన్ని మార్చడానికి మీ కొత్త ప్రయాణం ప్రారంభించినందుకు నా శుభాకాంక్షలు, దీవెనలు. నీ గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఏం జరగబోతుందో చూడాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉంది" అంటూ మంచు లక్ష్మి తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అంతే ఆమె ట్వీట్ వేసిన అప్పటి నుంచి ట్రోలింగ్ మొదలైంది. కొంత మంది లక్ష్మిని టార్గెట్ చేసి ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నావ్... ప్రపంచాన్ని మార్చే ది ఏంటి ? ముందు 'మోసగాళ్లు" రికార్డ్స్ మార్చండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ విమర్శలు చూసిన మంచు లక్ష్మి కూడా స్పందిస్తూ "ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడూ రెడీగా ఉంటారు నేను చెప్పింది మా అసోసియేషన్ ప్రపంచాన్ని మార్చమని మాత్రమే" అని సమర్ధించుకుంది. అయినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇక లైట్ తీసుకున్న మంచు లక్ష్మి నా తప్పులు చాలా ఉన్నప్పటికీ నన్ను నేను ప్రేమిస్తాను... కొన్ని తప్పుల వల్ల ఇతరులను ఎలా ద్వేషిస్తాను" అంటూ వివేకానంద కోట్ ను పోస్ట్ చేసింది.

ఇక సాధారణ ఎన్నికలను తలపించిన 'మా' ఎన్నికల్లో చాలా గందరగోళం తర్వాత మంచు విష్ణు అధ్యక్షుడయ్యారు. కానీ మరోవైపు ప్రకాష్ రాజ్ బృందం ఈ విషయంపై చాలా సంతృప్తిగా ఉన్నారు. కోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. సోమవారం నాడు ప్రకాష్ రాజ్ టీం కోర్టుకు వెళ్లే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: