టాలీవుడ్ మూవీ అసోసియేషన్ ఎన్నికలు గత వారం ఎన్నో వివాదాల నడుమ ఆసక్తికరంగా సాగాయని అందరికి తెలుసు. చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారో అని కూడా ఊహించ లేకపోయారని తెలుస్తుంది.

ఇక ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికల కంటే ఆసక్తికరంగా, హోరాహోరీగా జరిగాయని . చివరకు ఈ పోరులో ప్రకాష్ రాజ్ ను ఓడించి మంచు విష్ణు గెలిచారని అందరికి తెలుసు ఇక ఎన్నికల తర్వాత ఈ రోజు మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసారని తెలుస్తుంది.

ఫిలిం నగర్ కల్చరర్ సెంటర్ లో ఈ ప్రమాణ స్వీకారం ఉదయం 11 గంటలకు జరిగిందట.మంచు విష్ణుతో పాటు తన ప్యానల్ లోని సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని సమాచారం.ఇక ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట.. ఇక నుండి తాను కానీ తన ప్యానెల్ సభ్యులు కానీ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారని తెలుస్తుంది.

మా ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఇక నుండి తాను కానీ తన కమిటీ సభ్యులు కానీ మీడియా ముందుకు రామని ప్రకటించారని తెలుస్తుంది.. ఒక ఏడాదితో తాము తమ సభ్యులు ఎం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని చెప్పారట. అంతే కానీ ముగిసిన ఎన్నికల గురించి మాత్రం మాట్లాడబోమని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను గెలవాలని చాలా మంది పూజలు చేసారని వాటిని టివిలో చూశానని అలానే కొంతమంది తమను ఏడిపించారు కూడా అని విష్ణు తెలిపారని తెలుస్తుంది.

ఇక విష్ణు తర్వాత మా గత అధ్యక్షుడు నరేష్ కూడా మాట్లాడారని తెలుస్తుంది.ఆయన ఇంకనుండి తాను మంచిని గురించి మాత్రమే మాట్లాడుతానని ఇక నుండి ఏదైనా విమర్శలు తన దృష్టికి వస్తే మీడియాతో కాకుండా సంబంధిత వ్యక్తులతో మాట్లాడుతానని తెలిపారని సమాచారం. మరి చూడాలి మా కొత్త సభ్యులు ఇచ్చిన మాట ప్రకారం మీడియా ముందుకు రాకుండా ఉండగలరో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: