టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు.. బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో ఏకంగా 17 సినిమాలు తెరకెక్కాయని తెలుస్తుంది.. బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన తొలి సినిమా కథానాయకుడు కాగా నిప్పురవ్వ చివరి సినిమా అని సమాచారం.

బాలయ్య విజయశాంతి కలిసి నటించిన సినిమాలలో రౌడీ ఇన్ స్పెక్టర్ మరియు లారీ డ్రైవర్ అలాగే ముద్దుల మావయ్య బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని తెలుస్తుంది.

అయితే నిప్పురవ్వ తర్వాత బాలయ్య మరియు విజయశాంతి కలిసి నటించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని తెలుస్తుంది.. బాలకృష్ణ మరియు విజయశాంతి ఈ వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఈ వార్తలు నిజమేనని నమ్మారని తెలుస్తుంది.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ బాలయ్యతో విభేదాల గురించి స్పష్టతనిచ్చారని తెలుస్తుంది.. నిప్పురవ్వ సినిమా తర్వాత తన పారితోషికం భారీస్థాయిలో పెరిగిందని విజయశాంతి అన్నారని సమాచారం.

సినిమా తర్వాత తన ఇమేజ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని విజయశాంతి చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. నిప్పురవ్వ తర్వాత తాను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టానని ఆ కారణం వల్లే తాను బాలయ్య కలిసి నటించలేదని విజయశాంతి అన్నారని సమాచారం. అంతకు మించి తాను, బాలకృష్ణ కలిసి సినిమాల్లో నటించకపోవడానికి ప్రత్యేకమైన కారణం లేదని విజయశాంతి చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. నాయుడమ్మ సినిమా తర్వాత విజయశాంతి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారనే విషయం అందరికి తెలిసిందే. అయితే విజయశాంతి పాలిటిక్స్ లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారని తెలుస్తుంది.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాదాపు 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని అందరికి తెలిసిందే . అయితే వరుసగా సినిమాల్లో నటించడానికి మాత్రం విజయశాంతి ఆసక్తి చూపడం లేదని సమాచారం. పరిమితంగా సినిమాలలో నటిస్తున్న విజయశాంతి భవిష్యత్తులో బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఓకే చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉందిని తెలుస్తుంది. విజయశాంతి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: