దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ త్రిష చాలాకాలం తరువాత మల్లి ఫామ్ లో కి రానుంది . అప్పట్లో  ఈమె అనూహ్యంగా తెలుగు సినిమాలకు దూరమైంది. దాదాపుగా ఐదు సంవరల గ్యాప్ తరువాత త్రిష మల్లి సినిమాలలో బిజీ అవ్వాలనుకుంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయినప్పటికీ అడపా దడపా తమిళ్ సినిమాల్లో కనిపిస్తూనే ఉంటూవచ్చింది .  ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం విస్తరిస్తోంది రెగ్యులర్ సినిమాలతో పటు డిజిటల్ దునియాలో వెబ్ సిరీస్ ల పరంప కొనసాగుతూ ఉంది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ భామలు వెబ్ సిరీస్ లతో అలరారిస్తున్నారు కూడా. 

అయితే తాజాగా కాజల్, తమన్నా లు తమ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు. వారు చేసిన వెబ్ సిరీస్ లు మంచి రేటింగ్ ని తెచ్చిపెట్టడం తో ఇంకా పలు వెబ్ సిరీస్లు చేయనున్నారు. ప్రస్తుతం త్రిష కూడా వెబ్ సిరీస్ లలో బిజీ అవ్వాలనుకుంటుంది. ఆమె గ్లామర్ ఆమెకు కలిసొచ్చే విషయం .త్రిష కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకొని సోనీ లివ్ డిజిటల్  సంస్థ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ ను ప్లాన్ చేస్తూ వుంది. త్రిష కు దాదాపుగా ఐదు సంవత్సరాలనుండి తెలుగు లో ఎటువంటి అవకాశాలు రాలేదు.  సోనీ లివ్ డిజిటల్  సంస్థ తెలుగుతో సహా పలు భాషల్లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తూ ఉండడం తో వారికీ త్రిష ఓకే చెప్పింది. ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ను ఖరారు చేశారు.


 క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్నా ఈ చిత్రం కు  ఎనిమిది ఎపిసోడ్ లుగా విభజించారు. ఈ వెబ్ సిరీస్ కు సాయి కుమార్ , ఆమనీ లు ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నారు. అయితే ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోళ్ల ఈ వెబ్ సిరీస్ కు నిర్మాత మరియు డిజైనర్ గా  వ్యవహరించ బోతున్నారు. శక్తి కాంత్ ఈ వెబ్ సిరీస్ కు సంగీతాన్ని అందించబోతున్నారు. అదేవిధంగా సూర్య వంగల అనే కొత్త డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ కి దర్శ కత్వం వహించ నున్నారు. ఈ వెబ్ సిరీస్ తో నైనా త్రిషకు కలసివస్తుందేమో వేచిచూడాల్సిందే మరి.    


మరింత సమాచారం తెలుసుకోండి: