ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ ఓటిటి  క్రేజ్ ఎంత పెరిగిందో మన అందరికీ తెలిసిందే, ఒకప్పుడు చిన్న తరహా నటీ నటులు, ఇండస్ట్రీలో క్రేజ్ మొత్తానికి కోల్పోయిన నటినటులు ఈ ఓటిటి లలో  సందడి చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి, ఇండస్ట్రీలలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా డిజిటల్ మాధ్యమం లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, రానా తో కలిసి ఒక నెట్ ఫ్లెక్స్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కమిట్ అయ్యాడు. ఇలా విక్టరీ వెంకటేష్ ఓటిటి లో వెబ్ సిరీస్ తో సందడి చేయబోతుండగా, నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు ప్రముఖ  ఓటిటి ఆహా లో   అన్ స్టాపాబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

ఇప్పటికే ఈ టాక్ షో కు  సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపాబుల్ షో కు సంబంధించిన స్నేక్ పీక్ వీడియో ను కూడా ఆహా నిర్వహణ బృందం బయటకు వదలగా దీనికి జనాల నుండి మంచి స్పందన వస్తుంది. వీరితో పాటు ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీగా ఉన్నట్లు తెలియజేశాడు. అలాగే నాగార్జున కూడా ఒక మంచి స్క్రిప్ట్ కుదిరితే ఓటిటి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్నట్లుగా సంకేతాలు కూడా వదిలాడు. ఇలా తెలుగు సీనియర్ స్టార్ హీరోలు అందరూ డిజిటల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అంత గా ఆసక్తి చూపించడం లేదు అని చెప్పవచ్చు. మరి మెగాస్టార్ చిరంజీవి కూడా భవిష్యత్తులో ఓటిటి వైపు ఇంట్రెస్ట్ చూపుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: