దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, ఆ తర్వాత ఆ స్టార్  డమ్ ను కాపాడుకునే నేపథ్యంలో ప్రభాస్ వరుస  పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జిల్ పెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమాను దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్, ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు కూడా చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

సినిమా తో పాటు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు, ఈ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించేందుకు ప్రభాస్ రెడీగా ఉన్నాడు, ఇలా నాగ్ అశ్విన్ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు నాట మంచి దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకొని, అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కించే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటి అఫీషియల్ ప్రకటన జరిగిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఎనిమిది భాషల్లో తెరకెక్కబోయే    ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్త గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: