అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్లు ఈ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో సురేందర్ రెడ్డి, అఖిల్ చాలా స్టైలిష్ గా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.

మూవీ లో అఖిల్ సిక్స్ ప్యాక్ తో అలరించబోతున్నాడు. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. వైజాగ్ పోర్ట్ లో వెలుగు చూసిన హనీట్రాప్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు అని , మరో వైపు జోరు గా ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూవీ మొదటి షెడ్యూల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోనే జరిగింది. ఇక ఇటీ వలే మరొక షెడ్యూల్లో వైజాగ్ పోర్టు లో ఏజెంట్ చిత్ర బృందం ప్లాన్ చేశారు. ఏజెంట్ సినిమా వైజాగ్ షెడ్యూ ల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. షూట్ లో భాగంగా ఏజెంట్ చిత్ర బృందం విశాఖ కోస్టల్ బెల్ట్ మొత్తం చుట్టేసినట్లు ప్రచారం లో ఉంది. అయితే తాజా గా ఏజెంట్ చిత్ర బృందం విదేశాలకు పయనం కాబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ లోని బుడాఫెస్ట్ లో ఏజెంట్ చిత్రబృందం కీలక షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని అనేక రోజు లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై స్పందించిన అక్కినేని అఖిల్ ఏజెంట్ పాన్  ఇండియా సినిమా కాదు అని స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: