డార్లింగ్ ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేయడం కోసం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు, ఇప్పటికే సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసిన ప్రభాస్, ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నాడు,.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ఆఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆది పురుష్, కేజిఎఫ్ సినిమా ఇండియా రేంజ్ లో దర్శకుడిగా క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలను ప్రభాస్ చకచక పూర్తి చేసుకుంటున్నాడు.

అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అధికారిక లాంచింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ అర్జున్ రెడ్డి సినిమా తో దర్శకుడిగా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని, అదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో సాహిత్ కపూర్ హీరోగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, స్పిరిట్ సినిమాకు గాను ప్రభాస్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: