నందమూరి నట సింహం బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో సినిమా అంటే ఆ రోజుల్లో జనాలు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో వచ్చిన భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలతో పాటు మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్ లో రావడమే దానికి ప్రధా న కారణం. ఇప్పటికీ వీరి కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ షో నడుస్తున్న సమయంలో అనసూయ ఈ రోజు మా అందరి సమక్షంలో బాలకృష్ణ గారి కి ఫోన్ చేయండి అని రోజా ని అడిగింది. దానికి రోజా బాలకృష్ణ గారు మంచి మూడ్ లో ఉంటే ఓకే అంటూ ఫో న్ చేసింది.

 ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన బాలకృష్ణ రోజా ను బాగున్నారా అని అడిగాడు, దానికి బాగున్నాను అని సమాధానం ఇచ్చిన రోజా, జబర్దస్త్ లో ఉన్నాను అని చెప్పింది. మీరు ఏమి చేస్తున్నారు అని రోజా, బాలకృష్ణ అడగగా అఖండ సినిమా షూటింగ్ లో ఉన్నాను, మన అఖండ అంటూ బాలకృష్ణ సమాధానం ఇచ్చాడు. దానితో రోజా , బాలకృష్ణ ను మనిద్దరం కలిసి మళ్ళీ ఎప్పుడు యాక్ట్ చేద్దాం, భైరవ ద్వీపం టు నా బొబ్బిలి సింహం  టు నా అని  అడుగుతున్నారు అని చెప్పింది. అందరూ మన కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ బాలకృష్ణ సమాధానం ఇచ్చాడు. ఇలా బాలకృష్ణ , రోజా సంభాషణ చాలా ఆహ్లాదంగా జరిగింది మరియు నవ్వులు పూయించింది ఇలా బాలకృష్ణ, రోజా ల మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: