సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా గీతా గోవిందం సినిమా తో మంచి హిట్ ను అందుకున్న పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని పోస్టర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ చా లా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తుంది. ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 23 జనవరి 2022 న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

 ఈ సినిమా కు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా లో సముద్రఖని విలన్ గా కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు , సముద్రఖని మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి .మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు కావడంతో, కీర్తి సురేష్ కు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి  పాట చిత్ర బృందం ఈ ముద్దు గుమ్మ కు పుట్టిన రో జు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా బయటకు వదిలారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: