కెరీర్‌లో మైల్ స్టోన్ అని చెప్పుకునే సినిమా రావాలన్నా, అలాంటి అవకాశాలు రావాలి అన్నా అంత ఈజీ కాదు. అవకాశం తో పాటు ప్రతిభ దానికి తోడు కాస్త అదృష్టం ఇలా అన్ని కలిసొస్తేనే అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. ‘మహానటి’ సినిమా రూపంలో కీర్తీ సురేష్‌ కెరీర్‌లో కూడా అలాంటి అద్భుతమే జరిగింది. అప్పటి వరకు నేను శైలజ, నేను లోకల్ వంటి పలు చిత్రాలలో హీరోయిన్ గా చేసినా రాని స్పెషల్ గుర్తింపు మహానటి సినిమాతో ఆమెను వరించింది. ఆమె కెరియర్ లోనే ది బెస్ట్ మైల్‌స్టోన్‌ గా నిలచి ఆమె స్థాయిని అలా పెంచేసింది ఈ చిత్రం. ఇందులో కథ, దర్శకుడి ప్రతిభ ఒక ఎత్తు అయితే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన మరో ఎత్తు అనే చెప్పాలి.

నటిగా సినిమా సినిమాకీ తనని తాను స్పెషల్ గా ప్రూవ్‌ చేసుకుంటూ ఇండస్ట్రీలో స్పీడు పెంచిన  కీర్తి సురేష్ ఇప్పుడు అగ్ర హీరోయిన్ల లిస్ట్ లో టాప్ లో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అగ్ర హీరోల సరసన ఛాన్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట్లో స్కిన్ షోకి ఆమడ దూరంలో ఉండే ఈ బామ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ ని కాస్త పెంచడం వెనక రహస్యం ఇదే అంటున్నారు. కీర్తి సురేష్ టాలెంట్ కూడా ఏమైనా తక్కువ కళ్లతోనే ఎదుటి వారికి తన భావాలను అర్థమయ్యేలా తెలపగల మహా నటి.

తాజాగా  మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో  తన గ్లామర్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్  చేసేలా ఉన్నారని సమాచారం. గత సినిమాలతో పోలిస్తే సర్కారు వారి పాట మూవీలో కీర్తి గ్లామర్ చాలా స్పెషల్  అని టాక్. మరి ఈ సినిమా రిలీజ్ అయితే తప్పా మహేష్ సరసన కీర్తి ఎంత గ్లామరస్ గా కనిపించారో చూడాలి. మహానటి సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ఇంకా రాలేదు. కనీసం సర్కారువారిపాట మరియు త్వరలో రిలీజ్ కానున్న సఖి చిత్రాలు అయినా బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: