దసరా సందర్భంగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. సూపర్ హిట్ టాక్ ను మొదటి షో నుంచి అందుకున్న ఈ చిత్రం అఖిల్ విజయ ఆకలిని తీర్చిన సినిమా అని చెప్పవచ్చు. ఎన్నో అంచనాల మధ్య ఆయన తెరంగేట్రం చేయగా ఆయన గత మూడు సినిమాలు గా భారీ పరాభవాలను ఎదుర్కొంటున్నాడు.  దాంతో ఈ సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకోగా అది విడుదలై రోజు నుంచి సూపర్ హిట్ టాక్ ను  సొంతం చేసుకుంది.

ప్రస్తుతం అఖిల్ హిట్ జోష్ లో ఉన్నాడు.  ఆయన ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమాను కూడా చేసి సూపర్ హిట్ అందుకోవాలని ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. 50 కోట్ల దాకా బడ్జెట్ కావడం, స్టైలిష్ దర్శకుడు గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభ సమయంలోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు యూనిట్. అవి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ను కూడా ఎవరు వెల్లడించలేదు.

ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ని అఖిల్ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందని ఈ ఏడాది ఈ సినిమా రాకపోవచ్చని వేసవికి విడుదల కావచ్చు అని ఆయన చెప్పారు. దీంతో ఈ అప్డేట్ తో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. వాస్తవానికి సురేందర్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆయన ఇతర హీరోల సినిమాలతో బిజీగా ఉండటంతో దానికి కాస్త సమయం మిగిలి ఉండటంతో అక్కినేని అఖిల్ తో సినిమాను మొదలు పెట్టాడు సురేందర్ రెడ్డి. ఈ విడుదలైన పోస్టర్ లను బట్టి చూస్తుంటే ఈ చిత్రం తో మరొక హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది అక్కినేని అఖిల్. ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఆయన చేయబోయే ఆరవ సినిమా విషయంలో కూడా ఆయన ఫుల్ ఫాస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: