టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సుమారు 35 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు ఈ మెగా హీరో.అంతేకాదు త్వరలోనే షూటింగ్స్ లో కూడా జాయిన్ కానున్నాడు తేజు.కాగా అక్టోబర్ 15 న సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి.. ఇంటికి వచ్చాడు.ఇక ప్రాణాపాయం నుండి బయటపడిన తేజుకి ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా మారింది.దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు,సెలెబ్రిటీలు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారికతో పాటూ మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి..

 తేజుకి బర్త్ డే విషెస్ చెప్పిన ఓ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.నిహారిక,స్నేహారెడ్డి, ఉపాసన,అల్లు శిరీష్,శ్రీజ, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్..ఇలా చాలా మంది ఈ విడియో ద్వారా సాయి ధరమ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ విడియో ద్వారా అల్లు శిరీష్ ఓ హింట్ ఇచ్చాడు.త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.సింగిల్ గా నీకు ఇది చివరి బర్త్ డే అవుతుందని భావిస్తున్నా అంటూ శిరీష్ కామెంట్ చేశారు.ఇక శిరీష్ మాటలను బట్టి చూస్తోంటేసాయి ధరమ్ తేజ్ పెళ్లికి సర్వం సిద్ధం అని..ప్రకటనే తరువాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పెళ్లి విషయం పై ఆ మధ్య సాయి ధరమ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా సమయం ఉందని అన్నారు.కానీ తేజు కజిన్ శిరీష్ మాత్రం ఆయన పెళ్లిపై ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూనే ఉన్నాడు.ఒకవేళ సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురి కాకపోయుంటే ఇప్పటికే టతేజు పెళ్లిపై ప్రకటన కూడా వచ్చి ఉండేదేమో.ఇక ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న తేజు మరికొన్ని రోజుల్లో తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఇటీవలే తేజు నటించిన 'రిపబ్లిక్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: