అసలేం జరిగింది : శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ మూవీ ఈ నెల 22 న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు.
నాట్యం : ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మించిన సినిమా నాట్యం. ఈ సినిమా అక్టోబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించాడు.
మధుర వైన్స్ : నూతన నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్’. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకులను అలరించనుంది.
లవ్ స్టోరీ : నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కి ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో స్ట్రీమ్మింగ్ కానుంది.
హెడ్స్ అండ్ టేల్స్ : సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిచిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.