టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.. రాఘవేంద్రరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓటీటీలో ఉండబోతుంది అంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా యాదాద్రి పై కూడా తాను ఒక సినిమా చేస్తానని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. రాఘవేంద్ర రావు ఎక్కువగా భక్తిరస చిత్రాలతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అన్నమయ్య ...శ్రీరామదాసు లాంటి సినిమాలతో రాఘవేంద్రరావు ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేశారు. అంతేకాకుండా తన ప్రత్యేక మార్క్ ను తెలుగు సినిమా పరిశ్రమలో చూపించారు.

ఇక ఇప్పుడు తెలంగాణా లో నిర్మించిన యాదాద్రి పైనా ఓ సినిమా చేస్తానని రాఘవేంద్రరావు ప్రకటించారు. మరోవైపు రీసెంట్ గా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించిన పెళ్లిసందడి సినిమా విడుదలయ్యింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకోగా రాఘవేంద్రరావు సైతం ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమాతోనే మొదటిసారిగా రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం అవ్వడం విశేషం. ఇక ఈ సినిమాకు పాజిటివ్ తో పాటు నెగిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది.

కొంతమంది ఈ సినిమా బాగుందని అంటుండగా మరికొందరు మాత్రం రొటీన్ కథ అంటూ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఓటీటీ జోరు కనిపిస్తున్న సంగతి తెలిసిందే..ఇక రాఘవేంద్ర రావు భక్తి రస చిత్రాలు తెరకెక్కించినప్పటికీ రొమాంటిక్ సినిమాలు తీయడం లోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పాలి. అంతేకాకుండా వయసు ఎక్కువ ఉన్నా యువతరానికి తగ్గట్టుగానే రాఘవేంద్రరావు సినిమాలు తీసుకోవడం విశేషం. మరి ఓటీటీ అంటే ఎక్కువగా రొమాంటిక్ చిత్రమే దర్శనం ఇస్తుంటాయి. మరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓటీటీ లో రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తారా....లేదంటే భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: