మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇటీవల యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే.జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుమారు నెల రోజులకు పైగా ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాకా తేజు డిశ్చార్జ్ అయ్యాడు.ఇక తేజుకి యాక్సిడెంట్ అయిన సమయంలో అతను త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు ఇతర హీరోలు, వారి అభిమానులు సైతం ప్రార్థనలు చేశారు.ఇక ప్రస్తుతం తేజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక అంతా బాగానే ఉన్నా.. తేజు ఆస్పత్రి బిల్లు ఎంత అయ్యిందనే విషయం మాత్రం ఇప్పటివరకు బయటకి రాలేదు.ప్రస్తుత కాలంలో కార్పోరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మాములు విషయం కాదు.

ఇక సాయి ధరమ్ తేజ్ కి హాస్పిటల్ కో ఉండగానే రెండు సర్జరీలు జరిగాయి.యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు స్పృహలో లేని సాయి తేజ్.. కొన్ని రోజుల తర్వాత స్పృహ లోకి వచ్చాడు.అయితే సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి బిల్లు ఓ చిన్న హీరో సినిమా బడ్జెట్ అంత అయ్యిందని..అయితే తేజుకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండటంతో సాయి తేజ్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక మరోవైపు సాయి ధరమ్ తేజ్ వచ్చే నెల నుండి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం.వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే సాయి తేజ్ తన కొత్త సినిమాల రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక త్వరలోనే సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి బిల్లుకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి వచ్చే చాన్స్ ఉన్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ఇక సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాక అతని ఫోటోలు మీడియాలో సైతం రాలేదు.ఇకమ్తేజు సినిమా విషయాలకు వస్తే.. ఇటీవలే దేవా కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే సినిమాలో నటించాడు తేజు.అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.దీంతో తేజు కమర్షియల్ గా సక్సెస్ అయ్యే సినిమాలకు ఓకే చెప్పాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.ఇక సాయి తేజ్ ఇప్పటికే ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: