మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఇతర హీరోల కంటే తానేం తీసిపోనని చాటి చెబుతున్నాడు. ప్రస్తుతం
పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట
సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సగానికి పైనే ఈ
సినిమా షూటింగ్ పూర్తి కాగా వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది.
కరోనా కారణంగా ఈ
సినిమా చాలా రోజులు వాయిదా పడగా ప్రస్తుతం ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి అందరూ గట్టిగా పని చేస్తున్నారు.
ఇకపోతే ఈ
సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న తరుణంలో ఈ చిత్రం తో పాటు మరిన్ని భారీ
సినిమా లు రాబోతున్నాయి. అయితే ఇలా అందరితో కలిసి రిస్కు చేయడం ఎందుకని సోలో గా రావాలని భావించినట్లు ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇంతవరకు చిత్రబృందం ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ
సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి.
మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్నాడు త్రివిక్రమ్. దీనితో పాటే
రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ బాబు
సినిమా చేయనున్నాడు. ఇంకా
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఆయన ఓ
సినిమా చేయనున్నట్లూ గా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు హీరోగా
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామాయణం 3d
సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
అల్లు అరవింద్ 1000 కోట్లతో మూడు భాగాలుగా ఈ సినిమాను చేయాలని చాలా రోజుల క్రితం భావించగా మళ్లీ ఇప్పుడు ఈ
సినిమా గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు
అనిల్ రావిపూడి గీతా ఆర్ట్స్ సంస్థ తో మహేష్ బాబు హీరోగా ఓ
సినిమా చేయనున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమో తెలియాలి.