సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమాలో అందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లకు ఇప్పటికే జనాలు నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ ను చక చక పూర్తి చేస్తున్న చిత్ర బృందం ఈ మూవీ ని సంక్రాంతి కానుక గా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటన చేసింది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, అయితే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అది ఏంటంటే..
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా మధ్య ఉండే సమయంలో లో తెలుగు కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా మహేష్ బాబు మెగా కాంపౌండ్ కు దగ్గర అవుతున్నాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించాడు.ఇలా మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: