నందమూరి నట సింహం
బాలకృష్ణ హీరోగా
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్,
పూర్ణ హీరోయిన్లుగా తెరకెక్కిన అఖండ
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిన విషయం మన అందరికీ తెలిసిందే, అయితే ఈ
సినిమా పూర్తి కాగానే
క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం
బాలకృష్ణ ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటన జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు జై
బాలయ్య అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు కూడా అనేక వార్తలు బయటికి వస్తున్నాయి, అయితే తాజా గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
బాలకృష్ణ హీరోగా నటించబోయే సినిమాలో
బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి, ఒక పాత్రలో ఫ్యాక్షనిస్టు గా మరొక పాత్రలో స్వామీజీగా
బాలకృష్ణ ను దర్శకుడు గోపీచంద్ మలినేని చూపించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలో కూడా
బాలకృష్ణ రైతు గా, అఘోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇలా
బాలకృష్ణ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తూ తన అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో
బాలకృష్ణ హీరోగా తెరకెక్కే సినిమాలో త్రిషను
హీరోయిన్ గా కనిపించనుందని ఫిల్మ్
నగర్ లో ఓ టాక్ నడుస్తుంది. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ బ్యాక్ డ్రాప్లో ఈ
మూవీ నడుస్తుందట, ప్రముఖ నిర్మాణ సంస్థ
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.