ఇటీవల ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రకటించాడు.  అర్జున్ రెడ్డి చిత్రంతో అలరించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. టి సిరీస్ మరియు భద్రకాళీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ గా తెరకెక్కే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సందీప్ రెడ్డి వంగా అక్కడ కబీర్ సింగ్ సినిమా చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో డెవిల్ అనే సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు.

కానీ అనూహ్యంగా బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ హీరోగా యనిమల్ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు.  అయితే తెలుగు దర్శకుడు తెలుగులో అంత పెద్ద హిట్ అందుకున్న తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయట్లేదు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తో ఈ స్పిరిట్ చిత్రాన్ని అనౌన్స్ చేసి ఒక్కసారిగా ఆ విమర్శలకు సమాధానాలు చెప్పాడు సందీప్ రెడ్డి. అలా సందీప్ స్పిరిట్ సినిమాతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పగా ఈ సినిమా ను పలువురు స్టార్ హీరో లు రిజెక్ట్ చేసిన మూవీ అని ఎప్పటినుంచో  వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ సినిమా కథను రామ్ చరణ్ కు చెప్పగా ఆయనకు కథ నచ్చక రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.  కొంత కాలానికి ఇదే కథను మహేష్ బాబుకు కొన్ని మార్పులతో నేరెట్ చేశాడట. అక్కడ కూడా ఓకే కాలేదు ఈ సినిమా.  ఆ తర్వాత అల్లు అర్జున్ కి కూడా చెప్పగా సందీప్ రెడ్డి ఆయనను కూడా మెప్పించ లేకపోయాడు. దాంతో ఆ స్క్రిప్టుని పక్కనపెట్టి తన పని తాను చేసుకుంటూ పోతున్న సందీప్ రెడ్డి కి ప్రభాస్ నుంచి కాల్ రావడం ఆయనకు స్పిరిట్ కథ నచ్చడం సినిమా ఓకే కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. మరి ఇంత మంది రిజెక్ట్ చేసిన కథలో ప్రభాస్ కు ఏం నచ్చిందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఎనిమిది భాషలలో విడుదల అవడం చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: