మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా ఫిబ్రవరి 24వ తేదిన విడుదలకు సిద్ధం చేస్తున్న చిరంజీవి తొందరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోయే గాడ్ ఫాదర్ చిత్రం ను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. ఇక మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమా కూడా తొందరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.

తొందర్లోనే ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా చిరంజీవి ప్రణాళికలు రచించాడు. ఇక బాబీ దర్శకత్వంలోని సినిమా ను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు చిరు.  ఆ విధంగా ఒకే సారి ఈ మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లి సంవత్సర కాలంలోనే ఈ చిత్రాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయే సినిమాలను కూడా అనౌన్స్ చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. 

ఈ మూడు సినిమాల తరువాత చిరంజీవి వెంకీ కుడుముల దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తమిళం లో సూపర్ హిట్టయిన  ఎంత వాడు గానీ సినిమా ను వెంకీ కుడుముల తో ఆయన తెలుగు లో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని వరుణ్ తేజ్ తో చేయబోతుండటం చిరు సినిమా ఏమై ఉంటుందా అనే కొంత అనుమానం ప్రేక్షకుల్లో ఉంది. ప్రస్తుతం వరుణ్ గని సినిమా ను డిసెంబర్ లో విడుదల చేస్తున్నాడు. ఆ తర్వాత వెంకీ కుడుముల తో సినిమా ను మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛలో, భీష్మ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ వరుణ్ తేజ్ తో ఏ విధంగా సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: