ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులలో క్రేజ్ తెచ్చుకుని అగ్ర దర్శకుడిగా మారిపోయాడు
ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వం వహించిన కే జి ఎఫ్
సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది. దేశంలోనే స్టార్ హీరోలందరూ ఆయనతో
సినిమా చేయాలి అనుకునే వారే. ఆ విధంగా
టాలీవుడ్ లోనీ ముగ్గురు స్టార్ హీరోల తో
ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాలను చేస్తున్నాడు.
కేజిఎఫ్ రెండవ భాగం
సినిమా విడుదల కాకముందే ఆయన తన తదుపరి చిత్రాన్ని
ప్రభాస్ తో కలసి చేశాడు.
వారి కలయిక లో వచ్చిన సలార్ సినిమాను దాదాపు పూర్తి చేసే స్థితికి తీసుకు వచ్చాడు ప్రశాంత్. ఓ వైపు ఈ సినిమాను చేస్తూనే మరొకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రశాంత్. ఇప్పటికే ఈ చిత్రం తర్వాత
ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం కూడా పూర్తి చేశాడు. ఇక ఇటీవల
దసరా సందర్భంగా
రామ్ చరణ్ తో ఆయన చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ విధంగా
ప్రశాంత్ నీళ్లు ఒకే ఒక్క సినిమాతో
టాలీవుడ్ లో ముగ్గురు పెద్ద హీరోల సినిమాల అవకాశాలను కొట్టేసి మరో మూడేళ్ల దాకా ఫుల్ బిజీ అయిపోయాడు.
ఇక ప్రశాంత నీల్ చేయబోతున్న ఈ మూడు సినిమాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ మీరు గమనించే ఉంటారు. వీరు ముగ్గురు కూడా
టాలీవుడ్ స్టార్
హీరో లే కాకుండా ఈ ముగ్గురు సినిమాలు కూడా పాన్
ఇండియా చిత్రాలు గా చేయబోతున్న సినిమాలే కావడం విశేషం. ఏదేమైనా
ప్రశాంత్ నీల్ దేశంలోని ఏ దర్శకుడికి దక్కని విధంగా భారీ క్రేజ్ అందుకుని ఇప్పుడు ఇంతటి స్థాయికి ఎదిగి స్టార్ హీరోలను తన తదుపరి సినిమాలలో హీరోలుగా ఎంపిక చేసుకున్నాడు. మరి భవిష్యత్తులో ఈ దర్శకుడు ఎలాంటి సంచలనాలు సృష్టించే
సినిమా లు చేస్తాడో చూడాలి.