ప్రభాస్ తన ల్యాండ్ మార్క్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్ అనే పేరుతో ఈ సినిమా రాబోతుండగా దీన్ని తమిళ్ హిందీ కన్నడం మలయాళ జపనీస్ చైనీస్ కొరియన్ భాషలలో పాన్ వరల్డ్ సినిమా గా ప్రభాస్ చేయనున్నాడు. ఇందులో ఓ సూపర్ కాప్ గా ఆయన కనిపించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్న ప్రభాస్ ఇప్పటి వరకు తాను ఇప్పటికే ఒప్పుకున్న అన్ని సినిమాలను పూర్తి చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమాని టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంస్థలో నిర్మిస్తుండగా అర్జున్ రెడ్డి సినిమా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో సంచలనం సృష్టించాలని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరైనా తమ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని స్పెషల్ గా ఉండాలని చూసుకుంటారు. అందులోనూ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో అంటే పెద్ద దర్శకుడితో సినిమా చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు.

కానీ సందీప్ రెడ్డి వంగా తో తన ల్యాండ్మార్క్ చిత్రం చేయడం అందరికీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఈ సినిమాలో చాలా స్పెషల్స్ ఉన్నాయని తప్పకుండా ఈ చిత్రం తన ల్యాండ్మార్క్ ఈ చిత్రానికి సరైనదే అని ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడట. ఇక ఈ చిత్రంలో విలన్ గా కరీనా కపూర్ ను అనుకుంటున్నారు. ప్రభాస్ తొలిసారిగా ఓ లేడీ విలన్ తో ఈ సినిమాలో తలపడుతున్నాడు.  ఈ సినిమాకు గాను ఆమె పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి వంగా. సూపర్ ఉమెన్ తరహాలో ఆమె పాత్రను ఇందులో డిజైన్ చేశాడట. మరి ఆమె విన్యాసాలకు తగ్గట్టు ప్రభాస్ పోలీస్ సాహసాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: