మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ అప్పుడెప్పుడో సీనియ‌ర్ హీరో బాల‌య్య తో గొడ‌వ జ‌రిగిందంటూ పెద్ద కాంట్ర‌వ‌ర్సీనే ఎదుర్కోన్నారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించిన భ‌ద్ర సినిమా లో మీరా జాస్మిన్ హీరోయిన్ గా చేసింది. అదే స‌మయంలో బాల‌య్య మ‌హార‌థి సినిమాలో కూడా మీరా జాస్మిన్ హీరోయిన్‌. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో గాని బాల‌య్య‌కు, ర‌వితేజ‌కు మ‌ధ్య చిన్న డిస్క‌ర్ష‌న్ జ‌రిగింద‌న్న ఓ టాక్ అయితే ఉంది. త‌ర్వాత చాలా రోజుల‌కు మ‌ళ్లీ ర‌వితేజ డ్ర‌గ్ ఇష్యూతో పాటు మ‌రో డైరెక్ట‌ర్‌తో జ‌రిగిన గొడ‌వ కార‌ణంగా కాంట్ర‌వ‌ర్సీ లో చిక్కుకున్నారు.

రీసెంట్ గా ద‌ర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా లో ముందు మ‌హా క్యారెక్ట‌ర్ కు ర‌వితేజ‌ను అనుకున్నారు. అస‌లు అంత కంటే ముందుగా ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించిననా ఈ ప్రాజెక్టు ఎందుకో సెట్ కాలేదు. ఆ త‌ర్వాత ర‌వితే జ ఓకే చెప్పారు. అయితే మ‌హా క్యారెక్ట‌ర్ ను కాస్త మార్చాల‌ని ర‌వితేజ చెప్పినా ద‌ర్శ‌కుడు ఒప్పుకోలేదట‌. తాను చెప్పిన కొన్ని సూచ‌న‌లు , స‌ల‌హా లు పాటించాల‌ని ఎంతో చెప్పి విఫ‌ల ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌ ర‌వితేజ‌.

దీంతో ర‌వితేజ సినిమా నుంచి స‌డెన్‌గా డ్రాఫ్ అయ్యాడు. దీంతో ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి కి చిర్రెత్తు కొచ్చింది. ఆయ‌న సోషల్ మీడియా వేదికగా రవితేజను టార్గెట్ చేశారు. అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ అంటూ భూప‌తి పెట్టిన పోస్ట్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది. అలా అనుకోకుండా వారిద్ద‌రి మ‌ధ్య అలా వార్ జ‌రిగింది. అయితే ఇప్పుడు ర‌వితేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుని మంచి ప‌ని చేశాడ‌నే అంటున్నారు. లేక‌పోతే ర‌వితేజ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ప‌డి ఉండేద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: