డార్లింగ్ ప్రభాస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే, ఆ స్టార్ డమ్ ను కాపాడుకునే నేపథ్యంలో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు, ఇప్పటికే సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి విడుదల చేసిన ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ సినిమా తో ఇండియా వైట్ గా దర్శకుడిగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే జనాలలో ఫుల్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. సోలార్ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు గురించి ఇప్పటికీ చిత్ర బృందం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. కాక పోతే ఈ వార్త ఒక  వేళ నిజమే కానీ అయితే సలార్ సినిమాకు ఈ అంశం చాలా కలిసి వస్తుంది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రాదే శ్యామ్, ఆది పురుష్, సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 14 జనవరి 2022 లో విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: