ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కి కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ ను సరి కొత్తగా క్రియేట్ చేశారు నిర్వాహకులు. అందులో మోజ్ రూమ్ కూడా ఒకటి. ఇది ఒక స్పెషల్ రూమ్. హౌస్ మేట్స్ గ్రూపుగా ఏర్పడి ఈ మోజ్ రూమ్ లో ఎంచక్కా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడున్న హౌస్మేట్స్ లో ఓ ముగ్గురు మాత్రం ఈ  మోజ్  రూమ్ ని బాగా వాడుకుంటున్నారు. ఆ త్రిమూర్తులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లే సిరి, షణ్ముఖ్, జస్వంత్. అయితే ఇప్పుడు ఆ త్రిమూర్తులు కాస్త ఇద్దరు అయిపోతున్నారా?

మంగళవారం జరిగిన ఎపిసోడ్ చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎపిసోడ్ లో ఈ ముగ్గురు ఒక దగ్గర కనిపించిన  ఫ్రేమ్ లు లేవు. షణ్ముఖ్ జస్వంత్ ఒక దగ్గర ఉంటే.. సిరి మాత్రం వేరే గా తన పని తాను చేసుకుంటోంది.  షణ్ముఖ మాటలు సిరి కి నచ్చక పోవడం.. అటు సిరి చేష్టలు షణ్ముక్ కి నచ్చకపోవడం.. దీనికి కారణమని చెప్పొచ్చు. మరోవైపు దీనికి ఆజ్యం పోసినట్లు బెడ్ చేంజింగ్ కూడా జరిగింది. మిస్ ప్రభావతి గుడ్ల టాస్క్ జరిగినప్పుడు సిరి బెడ్ రూమ్ కి వచ్చి ఒక బెడ్ కోసం వెతికింది. అది తన బెడ్ అనుకుని షణ్ముక్..' చూడు మన బెడ్ చూస్తోంది ఇది అంతే' అని అనేశాడు.  ఆ మాటలను సిరి విన్నది.

దాంతో సిరి.. 'వేరే బెడ్ చూస్తుంటే అలా ఎలా అంటాడు' అంటూ సిరి అలిగింది. ఇక జెస్సీ అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. అది వర్కవుట్ అవ్వలేదు  దాంతో ఈ త్రిమూర్తులకు బీటలు వారినట్లున్నాయి. అక్కడితో షణ్ముఖ్ జస్వంత్ తో సిరి సెపరేట్ గా ఉండడం మొదలు పెట్టింది. అలా ఈ త్రిమూర్తులు కాస్త ఇద్దరు అయిపోయారు...మరి తిరిగి ఈ త్రిమూర్తులు ఒకటవుతారా లేక ఎవరు ఎవరికి వారు సపరేట్గా గేమ్ ఆడతారా అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తిగా మారింది. అయితే సిరి కి మాత్రం ముందు గొడవపడి తర్వాత కలిసిపోవడం అలవాటే కదా. మరి సిరి ముందు ముందు ఏం చేస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: