టాలీవుడ్ సెన్సేషనల్
హీరో రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్
సినిమా తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్
సినిమా కోసం
విజయ్ దేవరకొండ ఎంతగానో కష్టపడుతున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేక్షకులను కొంత నిరాశ పరచడంతో ఈ సినిమాతో మళ్లీ అందరి దృష్టి తన వైపు మలచుకోవాలని చూస్తున్నాడు విజయ్. అందుకే ఈ సినిమాలో భారీ భారీ తారాగణాన్ని ఎంపిక చేసుకుంటూ దేశం మొత్తం ఈ
సినిమా వైపు చూసుకునేలా చేసుకుంటున్నాడు.
అనన్య పాండే
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర లో నటిస్తుండగా
హాలీవుడ్ నటుడు బాక్సర్
మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండడం ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఇటీవలే గోవాలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం చివరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తుంది. అయితే ఈ గ్యాప్ లోనే
విజయ్ దేవరకొండ తన తమ్ముడు
సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడని తెలుస్తుంది. తొలి రెండు సినిమాలతో
ఆనంద్ దేవరకొండ నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
తొలి సినిమాతో
సక్సెస్ సాధించలేకపోయినా రెండవ
సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు సొంత బ్యానర్ లో నే ఆయన మూడవ
సినిమా పుష్పక విమానం తెరకెక్కుతుంది.
నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం అన్నని హెల్ప్ అడిగారు
ఆనంద్ దేవరకొండ. తమ్ముడి కోరికను కాదనలేక ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం
విజయ్ దేవరకొండ పది రోజులు కేటాయించాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలు అలాగే ప్రీ రిలీజ్
ఈవెంట్స్ కు కూడా ఆయన హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.