ప్రముఖ యంగ్ డైరెక్టర్ జయ కిషోర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన మధుర వైన్స్ సినిమాను ఎస్ ఒరిజినల్స్ ఆర్ కే సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండేపు, సృజన్ యారబో లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ నవీన్, సమ్మోహిత్, సీమా చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ నెల 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈవెంట్ కి యంగ్ హీరో సందీప్ కిషన్ , ప్రముఖ యువ  దర్శకులు కిషోర్, బుచ్చిబాబు సానా.. నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరు కావడం గమనార్హం.. వీరంతా  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్ కు కూడా బెస్ట్ విషెస్ తెలియజేశారు.. ఇక ఈ సందర్భంగా మధుర వైన్స్ దర్శకుడు జయ కిషోర్ బండి మాట్లాడుతూ.. నా సినిమా కరోనా కారణంగా ఆలస్యం కాలేదు.. కేవలం ఒక సాంకేతిక నిపుణుడి కారణంగా 8 నెలలు ఆగిపోవాల్సి వచ్చింది..ప్రస్తుతం అన్ని అడ్డంకులను కూడా దాటుకొని ఈనెల అనగా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.. మధురానుభూతుల్ని పంచుతూ అందరిని చాలా చక్కగా మెప్పిస్తుంది అని తెలిపాడు.ఇదే నేపథ్యంలోనే సందీప్ కిషన్ కూడా మాట్లాడుతూ.. సినిమాలో నటించిన నటీనటులంతా షార్ట్ ఫిలిమ్స్ లో నుంచి వచ్చినప్పటికీ, ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు.. ముఖ్యంగా నాకు కూడా హీరోగా అవకాశం ఇచ్చింది ..ఒక కెరియర్ను ఏర్పాటు చేసింది ఈ షార్ట్ ఫిలిమ్స్ దర్శకులే.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం నాకుంది అంటూ తెలిపాడు..

ఇక కథానాయకుడిగా మధుర వైన్స్ సినిమాలో నటిస్తున్న సన్నీ కూడా మొదటి సినిమా తో హీరోగా పరిచయం అవుతున్నాను.. ఈ సినిమా నన్ను హీరోగా నిలబెడుతుంది అంటూ హర్షం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: