టాలీవుడ్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ గా అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన అక్కినేని నాగ చైతన్య, సమంత లు వ్యక్తిగత కారణాల వలన  విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించిన రోజు నుండి అభిమానుల దృష్టి వీరిపై మరింత పెరిగిందనే చెప్పాలి. ఎందుకు విడిపోతున్నారు? అసలేం జరిగింది? విషయం విడాకుల వరకు ఎందుకు వచ్చింది?సామ్ ఇకపై తెలుగు సినిమాలు చేయదా? ఎలాంటి సినిమాలు చేయనుంది? చై కెరియర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుబోతున్నారు? ఇలా వారికి సంబందించిన వ్యక్తిగత మరియు కెరియర్ కి సంబందించిన వివరాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా నాగ చైతన్య తదుపరి ప్రాజెక్ట్ కు సంబందించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైతు సామ్ డైరెక్టర్ నందిని రెడ్డితో ఒక సినిమాకి ఒక్కే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్నట్లు వినిపించగా..దీనిపై అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య అసలు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నారంటూ కొందరు అంటుంటే, అసలు చైతు నందిని రెడ్డి సినిమాని కన్సిడర్ చేయలేదని మరి కొందరు అంటున్నారు. ఇంకొందరేమో చైతు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంత డైరెక్టర్ నందిని రెడ్డితో మాత్రం సినిమా అస్సలు చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట.

మరి ఇక నైనా చైతు ఈ విషయం స్పందిస్తారో చూడాలి. ఇంకో వైపు సమంత ఫ్యాన్స్ ఏమో  ఏంటిది సామ్ ఎటొచ్చీ మళ్ళీ తిరిగి తిరిగి విషయం నీ దగ్గరకే వస్తుందని ఫీల్ అవుతున్నారట. వారి వ్యక్తిగత జీవితం వేరే..కెరియర్ వేరే రెండింటినీ ఎందుకు కలుపుతున్నారు అంటూ ఫైర్ అవుతున్నారట. ప్రస్తుతానికి వారిద్దరి చాప్టర్ మొన్నటితోనే ముగిసి పోయింది. ఇంక వారిద్దరినీ వదిలేయండి అంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: